దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డులో హమాలీల బంద్తో కొనుగోళ్లు ఆగిపోవడంతోమిర్చి రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. మిర్చి రైతులు ఆగ్రహంతో విధ్వంసానికి దిగారు.
గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనుగోళ్లు కూడా ఆగిపోవడంతోమిర్చిరైతులు దిక్కు తోచని స్థితిలో ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యదర్శి కార్యాలయం అద్దాలు పగుల గొట్టారు. అక్కడ పార్క్ చేసి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశారు. రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు.మిర్చి కొనుగోళ్లను రైతులకు ఇబ్బందికి కలగకుండా జరిపించేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీఇచ్చారు.
హమాలీల సమ్మెతోమిర్చి కొనుగోళ్లు ఆగకపోవడంతో మార్కెట్ యార్డు కార్యాలయంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయం కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసు, పారామిలటరీ బలగాలు రంగప్రవేశం చేసి రైతులను చెదరగొట్టాయి. సమస్య పరిష్కారానికి అధికారులు రైతు ప్రతినిధులతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన చర్చలు ఎట్టకేలకు కలెక్టర్ రామకృష్ణారావు జోక్యంతో ఒక కొలిక్కి వచ్చాయి.