నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు విదర్భ రాష్ట్రం ఏర్పాటు కూడా సాధ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభలు తీర్మానం చేస్తే ఆ ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ గతంలో తీర్మానం చేసి కేంద్ర నాయకత్వానికి పంపిందని, శాసనసభ తీర్మానం చేస్తేగానీ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు కాబట్టి ఆ తీర్మానాన్ని ఆమోదించలేదని ఆయన చెప్పారు. జార్ఖండ్, ఛత్తీస్ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటుకు ఆయా రాష్ట్రాల శాసనసభలు తీర్మానం చేశాయని ఆయన చెప్పారు.
అద్వానీ బుధవారం ఉదయం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. బిజెపి జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబుతో వారు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. సినీనటుడు సాయికుమార్, మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు అద్వానీ సమక్షంలో బిజెపిలో చేరారు.