వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. చంద్రశేఖర్‌ కథనం ప్రకారం- నల్లగొండ జిల్లా దేవరకొండ మాజీ సర్పంచ్‌ హనుమంతు చంద్రయ్య, తెలుగుదేశం మైనారిటీ నాయకుడు సమీ, నల్లగొండ జిల్లా డిండి తెలుగుదేశం మండలాధ్యక్షుడు రాఘవాచారి రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. నక్సలైట్ల నుంచి ప్రాణాపాయం ఉండడంతో ఆ ముగ్గురికి ఇద్దరు గన్‌మెన్‌ను ఇచ్చారు. తెలుగుదేశం నాయకులంతా కలిసి ఒక వాహనాన్ని తీసుకుని కొండబీమన్‌పల్లికి దారాసింగ్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నారు.

బుధవారం ఉదయం గన్‌మెన్‌లో ఒకరైన హెడ్‌ కానిస్టేబుల్‌ రామచంద్రుడు తన 90 ఎంఎం పిస్టల్‌ను మరో గన్‌మన్‌ అయిన కానిస్టేబుల్‌ గోరియా నాయక్‌కు ఇచ్చి టాయ్‌లెట్‌కు వెళ్లాడు. గోరియా నాయక్‌ ఆ పిస్టల్‌ పనిచేసే తీరును దారాసింగ్‌కు వివరిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది పేలి దారాసింగ్‌ కంఠంలోంచి బుల్లెట్‌ దూసుకుపోయింది. దారాసింగ్‌ అక్కడికక్కడే మరణించాడు. కానిస్టేబుల్‌ గోరియా నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X