వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సీట్ల గుర్తింపుపై కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నామని, రెండు రోజుల్లో సీట్లు ఖరారవుతాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు వెల్లడించే వ్యక్తిగత అభిప్రాయాలను పట్టించుకావల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పార్టీలపరంగా కాంగ్రెస్‌కు, తమకు మధ్య పొత్తు కుదిరిందని, పార్టీలపరంగానే సీట్ల గుర్తింపు జరుగుతుందని ఆయన అన్నారు. సీట్ల గుర్తింపు విలేకరులు అడిగినప్పుడు మీరే చూస్తారు కదా అని ఆయన అన్నారు.

తెలుగుదేశం నిజామాబాద్‌ సిట్టింగ్‌ పార్లమెంటు సభ్యుడు కేశుపల్లి గంగారెడ్డి వేలాది మంది కార్యకర్తలతో బుధవారం చంద్రశేఖర్‌ రావు, నరేంద్రల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలుగుదేశం నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన అన్నారు. నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని, దీన్ని ఎవరూ ఆపలేరని చంద్రశేఖర్‌ రావు ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్‌ నాయకులు డి. శ్రీనివాస్‌, డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ నేతలు కె. చంద్రశేఖర్‌ రావు, నరేంద్రలతో చర్చలు జరిపారు. బుధవారం రాత్రి చర్చలు కొలిక్కి వస్తాయని వారు చెబుతున్నారు. డి. శ్రీనివాస్‌, వైయస్‌లు బుధవారం రాత్రే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X