వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
ప్రజల కోసం పని చేస్తున్న నాయకులను నక్సలైట్లు హత్య చేస్తున్నారని, వారు ప్రజలపై యుద్ధం చేస్తున్నారని ఆయన అన్నారు. గిరిజనుల కోసం పనిచేస్తున్న నాయకులను నక్సలైట్లు కాల్చి చంపడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు. హత్యల ద్వారా నక్సలైట్లు రాజకీయ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య పని చేస్తున్న నాయకులను హత్య చేస్తున్న నక్సల్స్కు సహకరించకూడదని ఆయన ప్రజలను కోరారు.
వెంకట్రాజు హత్యను ఖండిస్తూ తెలుగుదేశంపార్టీ అత్యవసర సమావేశం తీర్మానం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. నక్సల్స్ హింసకు భయపడేది లేదని అంతకు ముందు నారా చంద్రబాబునాయుడు సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను నక్సల్స్ హత్య చేస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, March 18, 2004, 23:53 [IST]