వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
మొత్తం 35 సీట్లపై రాష్ట్ర స్థాయిలోనే ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. మరో ఏడు సీట్లపై కాంగ్రెస్ అధిష్ఠానంతో టిఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతారు. టిఆర్ఎస్కు 42 శాసనసభా స్థానాలు కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్యపై కాంగ్రెస్లోని ఒక వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. టిఆర్ఎస్ నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర శుక్రవారంనాటికి ఢిల్లీలో ఉంటారు.
చంద్రశేఖర్ రావు గురువారంనాడు నియోజకవర్గాల వారీగా గురువారం సమీక్ష జరిపారు. ఎన్నికల ప్రచారం కోసం పాటల క్యాసెట్ రూపకల్పనపై కూడా ఆయన దృష్టి సారించారు.
Story first published: Thursday, March 18, 2004, 23:53 [IST]