కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆదివారం విడుదల చేసిన మలి విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో పాత అభ్యర్థులే పోటీ చేస్తారు.
జాబితా:
1.
సికింద్రాబాద్
-
బండారు
దత్తాత్రేయ
2.
కరీంనగర్
-
చెన్నమనేని
విద్యాసాగర్
రావు
3.
నర్సాపురం
-
కృష్ణంరాజు
4.
రాజమండ్రి
-
కంటిపూడి
సర్వారాయుడు
5.
నెల్లూరు
-
బాలకొండయ్య
సీట్ల సర్దుబాటులో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బిజెపికి తొమ్మిది లోక్సభ స్థానాలు కేటాయించింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. మహబూబ్నగర్ నుంచి లోక్సభకు ప్రస్తుతం బిజెపికే చెందిన జితేందర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సీటు ఖరారు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ నుంచి బిజెపి తరఫున పోటీ చేసి గెలిచిన ఎ. నరేంద్ర ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు.