దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
హైదరాబాద్: రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై విమర్శలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవివేకానికి, అవగహనా రాహిత్యానికి నిదర్శనమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం నీటి పారుదల సౌకర్యాలను పెంచడంతో విఫలమైందని సోనియా చేసిన విమర్శను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో ఖండించారు.
నీటి పారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టును ప్రతిపక్షాల నాయకులకు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.