దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
రావల్పిండి: పాకిస్థాన్తో జరిగే రెండో వన్డే మ్యాచ్లో భారత కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఆడే అవకాశాలు లేవు. ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా మంగళవారంనాటి రెండో వన్డేకు దూరంగా వుంటున్నాడు.
కెప్టెన్ సౌరబ్ గంగూలీస్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన సోమవారం నెట్ ప్రాక్టీస్కుహాజరు కాలేదు. మంగళవారం ఉదయం ఆయనను వైద్యులు పరీక్షిస్తారు. ఆ తర్వాతే ఆయన ఆడుతాడా, లేడా అనేవిషయంపై నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాదీ బ్యాట్స్మన్వివియస్ లక్ష్మణ్ మంగళవారంనాటి మ్యాచ్లో ఆడేవిషయంపై సందిగ్దత వీడలేదు. లక్ష్మణ్పై కూడా మంగళవారం ఉదయమే నిర్ణయం తీసుకుంటారు.
గాయం కారణంగా నెహ్రా రెండో వన్డేలో ఆడే అవకాశం సన్నగిల్లింది. నెహ్రా స్థానంలో ఇర్ఫాన్ పఠాన్ ఆడుతాడు. కరాచీ వన్డేలో కీలకమైన చివరి ఓవర్ ద్వారా నెహ్రా భారత్కువిజయాన్ని సాధించి పెట్టాడు. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేసివిజయాన్ని అందుకోవాలనుకున్న పాకిస్థాన్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసి భారత్కు సంచలనవిజయాన్ని అందించాడు.
ఎడమ చేతి వాటం స్పిన్నర్ మురళీ కార్తిక్ కీలకమైన ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ఖాన్ల వికెట్లు తీసుకున్నప్పటికీ అతని ఆటతీరు అసంతృప్తికరంగానే ఉంది. దీంతో అతడ్ని మంగళవారంనాటి మ్యాచ్కు దూరంగా ఉంచే అవకాశాలున్నాయనిఅంటున్నారు. అతని స్థానంలో ఆల్ రౌండర్ రమేష్ పొవార్కు అవకాశం దక్కవచ్చు.