వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
హౖౖెదరాబాద్:తెలుగుదేశం టికెట్లు రానివారి సేవలనుపార్టీ పనికి ఉపయోగించుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడుచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. టికెట్లు రానిమంత్రులు పడాల భూమన్న, నేరెళ్లఆంజనేయులు, మరి కొందరు పార్టీనేతలను నిర్లక్ష్యం చేయబోమని, వారిసేవలను విధిగా పార్టీకి వినియోగించుకుంటామనిగురువారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో విలేకరులతోజరిగిన ఇష్టాగోష్టిలో ఆయన వివరించారు. టికెట్లకేటాయింపులో కొందరు అభ్యర్ధులపై పార్టీపరంగా,ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా సామాజికన్యాయంలో భాగంగా వారికి టికెట్లు ఇవ్వాల్సివచ్చిందని, ఇందులో ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదనిఆయన స్పష్టం చేశారు.
Comments
Story first published: Thursday, April 1, 2004, 23:53 [IST]