వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

ముల్తాన్‌:పాకిస్థాన్‌పై భారత్‌ ముల్తాన్‌క్రికెట్‌ టెస్టు మ్యాచ్‌లో చారిత్రాత్మకవిజయం సాధించింది. పాకిస్థాన్‌పై భారత్‌తొలి మ్యాచ్‌లో గురువారం ఇన్నింగ్స్‌యాభై పరుగుల తేడాతోవిజయకేతనం ఎగురవేసింది. ఇర్ఫాన్‌పఠాన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ద్రావిడ్‌ క్యాచ్‌అందుకుని యొహానాను గురువారంఅవుట్‌ చేయడంతో విజయం భారత్‌వశమైంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లోమూడు వందల తొమ్మిది పరుగులుచేసిన వీరేంద్ర సెహ్వాగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

తొమ్మిదివికెట్ల పతనంతో రెండు వందల ఏడుపరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తోగురువారం బ్యాటింగ్‌ ప్రారంభించినపాకిస్థాన్‌ రెండో ఓవర్‌లోనే యూసుఫ్‌యొహానా వికెట్‌ను కోల్పోయింది. రెండోఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ రెండు వందలపదహారు పరుగులకు ఆల్‌ అవుట్‌అయింది. కుంబ్లే డెబ్బయ్‌ రెండుపరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకోవడంద్వారా భారత్‌ విజయానికి బాటలు వేశాడు. ఈవిజయంతో భారత్‌ మూడు టెస్టు మ్యాచ్‌లసిరీస్‌లో ఒకటి- సున్నా తేడాతోముందంజలో ఉంది.భారత్‌తొలి ఇన్నింగ్స్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ట్రిపుల్‌ సెంచరీతో, సచిన్‌ టెండూల్కర్‌నూటా తొంబై నాలుగు పరుగులతో భారీస్కోర్‌ సాధించింది. పాకిస్థాన్‌కు ఫాలో ఆన్‌తప్పలేదు. ఫాలో ఆన్‌ ఆడిన పాకిస్థాన్‌వికెట్లు వడివడిగా పడిపోతూ వచ్చాయి.యొహానా మాత్రమే నిలకడగా ఆడి సెంచరీపూర్తి చేశాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X