వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జైత్ర యాత్రనిర్వహిస్తున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డికి మిగిలింది తీర్థయాత్రలేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఇప్పుడుజైత్ర యాత్ర, దాని తర్వాత తీర్థ్ధ యాత్రలే... ఇది నేను చెప్పడంలేదు. వాళ్లే అంటున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకుంటేరాజకీయ సన్యాసం చేస్తానని గతంలో వై. ఎస్‌ ప్రకటించినవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మొన్నటి వరకు డ్వాక్రా సంఘాలను విమర్శించినకాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లు మహిళల మద్దతు తెలుగుదేశం పార్టీకిఉందని గ్రహించి మహిళా సదస్సు పెడతామని చెప్పి పెట్టలేకపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వ్యతిరేక పవనాలువీస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఎప్పుడూ ప్రభుత్వంపైవ్యతిరేకత వ్యక్తం అవుతుంటుందని కానీ ఈసారి ప్రతిపక్షాలుప్రజా వ్యతిరేకతను చవి చూస్తాయని, ఈ ఎన్నికలు రాష్ట్రానికిచరిత్రాత్మకం కాబోతున్నాయని ఆయన చెప్పారు.ప్రధాని అయ్యేఅర్హత సోనియాకు ఎక్కడుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆమెనుప్రధానిగా అంగీకారించాల్సిన ఖర్మ భారతీయులకు లేదన్నారు.కాపురం చేయడం వేరు... దేశానికి నాయకత్వంవహించడం వేరు... ఏదో అవకాశ వాదంతో కొందరు నేతలుపదవుల కోసం ఆమెను పార్టీకి నాయకురాలిగాఎన్నుకున్నంత మాత్రాన ప్రధాని ఎలా కాగలరు? అని ఆయనఅన్నారు. సోనియా దేశానికి ప్రధాని కావడం కంటే సిగ్గుచేటైనవిషయం వేరొకటి ఉండబోదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X