వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:నక్సలైట్ల హెచ్చరికలను ఖాతరుచేయవద్దని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ప్రజలకుపిలుపునిచ్చారు. నక్సల్స్‌హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయనప్రజలను కోరారు. మన ఓటు - మనభవిష్యత్తు కార్యక్రమంలో భాగంగాఆయన బుధవారం టెలిఫోన్‌లో ప్రజలతోమాట్లాడారు.

ప్రజలఓటు హక్కు వినియోగం మీదనే రాష్ట్రభవిష్యత్తు ఆధారపడి ఉన్నదనిఆయన అన్నారు. నక్సలైట్లవిధ్వంసకాండ గురించి ఆయన ప్రజలకువివరించారు. నక్సలైట్లు రాష్ట్రంలోమూడు వేల మందికిపైగా హత్యచేశారని, రెండు కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులను ధ్వంసం చేశారనిఆయన చెప్పారు. తుపాకులతోభయపెట్టి నక్సల్స్‌ ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం పాలు చేస్తున్నారని ఆయనవిమర్శించారు.సామాజికన్యాయం కోసం కొన్ని చోట్ల తాముఅభ్యర్థులను మార్చామని ఆయనవిలేకరులతో అన్నారు. కాంగ్రెస్‌వారుడబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారని,అటువంటివారు ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రపరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చుననిఆయన అన్నారు. టికెట్లు దొరకని పార్టీనాయకుల సేవలను మరో రకంగావాడుకుంటామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X