రాజమండ్రి:ప్రధాని వాజపేయి తన సహజశైలిలోకాంగ్రెసు పార్టీపై వ్యంగ్యబాణాలు సంధించారు.కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంగా విఫలమైందని,అయినప్పటికీ ప్రతిపక్షంగా కాంగ్రెసుకుఅవకాశం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు.బుధవారం ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడితో కలిసి బహిరంగసభలోప్రసంగించారు.
కాంగ్రెసు పార్టీ అధికారదాహంతో కేంద్రంలో అస్ధిరత్వం తెచ్చిందనిఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోదివంగత ఎన్టీ రామారావు రెండుదశాబ్దాల క్రితమే కాంగ్రెస్ పార్టీ అహంభావాన్నిపటాపంచలు చేశారన్నారు. కేంద్రంలోతన సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్ళక్రితం అధికారం చేపట్టి, సుపరిపాలన,సుస్థిర పాలన అందించడం ద్వారా కాంగ్రెస్దురభిప్రాయాన్ని తొలగించిందని పేర్కొన్నారు.