మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
శ్రీకాకుళం:కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) మహిళలకుభయపడుతున్నాయనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. టిఆర్యస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు మహిళలనుకించపరిచే విధంగా మాట్లాడారని, ఆవిధంగా కించపరచడం ఫ్యూడల్మనస్తత్వమని ఆయనవిలేకరులతో అన్నారు.చంద్రబాబునాయుడు బుధవారంశ్రీకాకుళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనివిజయనగరం బయలుదేరివెళ్లారు.
తానునక్సలైట్లను, ఉగ్రవాదులనువ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్లెజిస్లేచర్ పార్టీ (సియల్పి) మాజీనేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్రెడ్డి ఫ్యాక్షనిజాన్నివ్యతిరేకించాలని ఆయనఅభిప్రాయపడ్డారు. రాజశేఖర్ రెడ్డిఇరవై అయిదేళ్ల పాటు వివిధపదవుల్లో వున్నారని, అయినా ప్రజల కోసంఏమీ చేయలేదని, పులివెందులనియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిపరచలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని,కాంగ్రెస్ ఇస్తున్న హామీలలో స్పష్టతలేదని ఆయన విమర్శించారు.తెలుగుదేశం పట్ల ప్రజా స్పందన చాలాబాగుందని ఆయన అన్నారు. కాంగ్రెస్నేతల్లో సమన్వయం లేదని,తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారనిఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్డబ్బున్న వారికి టికెట్లు ఇస్తే తాముసేవానిరతితో పని చేసినవారికి టికెట్లుఇచ్చామని ఆయన చెప్పారు.