వాళ్ళు బాగా ఆడారు:రాహుల్ ద్రావిడ్
ఢాకా:పెను తుఫాను తాకిడికి బంగ్లాదేశ్అతలాకుతలం అయింది. రెండు సార్లుతాకిన పెను ఉప్పెనకు సుమారునలబై ఒక్క మంది అసువులు బాసినట్లుసమాచారం. ఉత్తర బంగ్లాదేశ్లోనిపలు గ్రామాలను బుధవారం రాత్రిఉప్పెన తాకింది. వందలాది మందిఇందులో గాయపడ్డారు.
మేఘాలయసరిహద్దుల్లో గల బంగ్లాదేశ్లోనినెట్రొకోనా, మైమిన్సింగ్ జిల్లాల్లోనిరెండు డజన్ల వ్యవసాయగ్రామాలను పెను ఉప్పెన ముంచేసింది.బంగ్లాదేశ్ నూతన సంవత్సరంతొలి రోజు ఉత్సవం పహేలా బైషాక్జరుపుకుంటున్న తరుణంలో ఈ ఉప్పెనతాకింది.
ప్రాథమికనివేదికల ప్రకారం ఢాకాకు నూటా పదికిలోమీటర్ల దూరంలో గలమైమిన్సింగ్ జిల్లాలోని హాలువాఘాట్ఉపజిల్లాలో పదిహేను మందిమరణించారు. ఉప్పెన వల్ల చెట్లుకూకటివేళ్లతో కూలిపోయాయి. ఇళ్లు,పంటలు నాశనమయ్యాయి. వందలాదిమంది గాయపడ్డారు. వేలాది మందినిరాశ్రయులయ్యారు. ఢాకాకు నూటాముప్పై కిలోమీటర్ల ఉత్తరాన ఉన్ననెట్రొకోనా సమీపంలోని పలు ప్రాంతాలనుఉప్పెన తాకింది. గాయపడినవందలాది మందిలో చాలా మంది పరిస్థితిఆందోళనకరంగా ఉంది.