మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
బెంగుళూర్:ప్రమాదానికి గురైన విమానానికిచెందిన పత్రాలను అన్నింటినీ పౌరవిమానయాన డైరెక్టరేట్జనరల్ స్వాధీనం చేసుకున్నారు.సెస్నా నూటా ఎనబై ఎయిర్క్రాఫ్ట్కూలిపోయిన సంఘటనలో సినీ నటిసౌందర్యతో సహా నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.దర్యాప్తుబృందం విమానానికి చెందిన పత్రాలనుఅన్నింటినీ స్వాధీనం చేసుకున్నదని, వారివద్ద ఒక్క పత్రం కూడా లేదని ఎయిర్వర్తినెస్ డైరెక్టర్ జి.టి. శివంఆదివారంనాడు చెప్పారు. విమానానికిసంబంధించి అన్ని పరీక్షలు జరిగాయని,విమానం ఎగరడానికి అవసరమైనసర్టిఫికెట్ను జనవరిలో ఇవ్వడంజరిగిందని డైరెక్టరేట్ అధికారిపరమేశ్వరన్ చెప్పారు.పాండిచ్చేరికిచెందిన ఐటి కంపెనీ నెక్షస్కంప్యూటర్స్ నుంచి అగ్ని ఏవియేషన్ ఏడాదిక్రితం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఈ విమానం ఏడు వేల గంటలుతిరిగింది. ఒక స్నేహితుడి విజ్ఞప్తి మేరకుసౌందర్యను, ఆమె సోదరుడుఅమర్నాథ్ను, హిందూ జాగరణవేదిక నాయకుడు రమేషన్కడంను కరీంనగర్ చేర్చడానికి ఈవిమానాన్ని వాడాలనుకున్నట్లు, ఈ విమానంపైకి ఎగిరిన కొద్దిసేపటికేకూలిపోయినట్లు అగ్ని ఏవియేషన్ అంటోంది.ఈవిమానం ఎగరడానికి అగ్ని ఏవియేషన్కులైసెన్స్ ఉందా లేదా అనే విసయంతెలియదని, న్యూఢిల్లీలోని తమకార్యాలయం లైసెన్స్ ఇచ్చిందేమోతెలియదని పౌర విమానయానడైరెక్టరేట్ జనరల్ అన్నారు.తగిన బీమా పత్రాలు ఉన్నాయా లేదా అనేవిషయం కూడా డైరెక్టరేట్జనరల్కు తెలియదు.