వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భార్యకుప్రచారం చేసిన ఎసిపి సస్పెన్షన్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలనిబంధనలను ఉల్లంఘించిన వివిధ పార్టీలకు చెందిన ఆనేక మందిఅభ్యర్ధులపై కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలోఅక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనం రాష్ట్ర మంత్రి నిమ్మలకిష్టప్పదని పోలీసులు తెలిపారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి, ఒకరిని అరెస్టుచేశారు. టిడిపి తరఫున డబ్బులు పంచుతున్న ఆదిలాబాద్ జిల్లాపరిషత్ ఛైర్మన్ శ్యాంసుంద ర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.గోదావరిఖనిలో టిడిపి మహిళానాయకురాలి ఇంట్లో ఎన్నికల డబ్బుకనుగొన్నామని పోలీసులు తెలిపారు. తిరుపతిలో కాంగ్రెస్ అభర్ధిచింతా మోహన్ అనుచరులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగాఓటర్లను ప్రలోభపెడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.కోదాడ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తం కుమార్ రెడ్డి పోలీసు అధికారిపైదౌర్జన్యం చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు.
Story first published: Monday, April 19, 2004, 23:53 [IST]