మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
హైదరాబాద్:రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరిగినస్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతకనబరిచినట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలుతెలియజేస్తున్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్పోల్ సర్వేలు నిర్వహించాయి.రాష్ట్రంలోమంగళవారం ఇరవై ఒక్కలోక్సభ స్థానాలకు, వాటి పరిధిల్లోనినూటా నలబై యేడు అసెంబ్లీ స్థానాలకుపోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన ఇరవైఒక్క లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కూటమికిపదమూడు స్థానాలు రాగలవనిఆజ్తక్ ఎగ్జిట్ పోల్ తేల్చింది.తెలుగుదేశం కూటమికి ఏడు స్థానాలు,ఇతరులకు ఒక స్థానం రాగలవనిఅంచనా వేసింది.తెలుగుదేశంకూటమికి ఎనిమిది స్థానాలు, కాంగ్రెస్ కూటమికిపన్నెండు స్థానాలు, ఇతరులకు ఒకస్థానం దక్కగలవని ఐ విజన్ అనే సంస్థఅంచనా వేసింది. తొలి విడత పోలింగ్ జరిగినస్థానాల్లో తెలుగుదేశం కూటమి ఓట్ల శాతంఐదు శాతం తగ్గిందని, కాంగ్రెస్కూటమికి ఆరు శాతం ఓట్లు పెరిగాయనిస్టార్ న్యూస్ తేల్చింది.మంగళవారంపోలింగ్ జరిగిన నూటా నలబై యేడు అసెంబ్లీస్థానాల్లో కాంగ్రెస్ కూటమికి డెబ్బై ఆరునుంచి అరవై మూడు వరకు,కాంగ్రెస్ కూటమికి డెబ్బై ఆరు నుంచిడెబ్బై స్థానాలు, ఇతరులకు ఎనిమిదిస్థానాలు రాగలవని జి - న్యూస్ ఎగ్జిట్ పోల్సర్వే తేల్చింది.కాంగ్రెస్తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుపెట్టుకుని తెలంగాణ ప్రాంతంలో పోటీకిదిగింది. తెలుగుదేశం బిజెపితో కలిసిఎన్నికల బరిలోకి దిగింది. కాంగ్రెస్వామపక్షాలతో సీట్ల అవగాహనచేసుకుంది. తెలంగాణ సెంటిమెంట్గణనీయంగా ఉండడంతో కాంగ్రెస్కూటమి అవకాశాలు మెరుగైనట్లుభావించవచ్చు. మంగళవారంపోలింగ్ జరిగిన ఇరవై ఒక్క లోక్సభస్థానాల్లో పదహారు తెలంగాణ ప్రాంతంలోఉండగా, ఉత్తరాంధ్రలో ఐదు స్థానాలుఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్,ప్రభుత్వ వ్యతిరేకత కారణంగాతెలుగుదేశం కూటమికి సీట్ల సంఖ్యతగ్గుతున్నట్లు భావించవచ్చు.