వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఓట్లు గల్లంతుతో పలువురుతెల్లబోయారు. సాధారణ ఓటర్ల ఓట్లేకాకుండా కొందరు ప్రముఖుల ఓట్లు కూడాగల్లంతయ్యాయి. మాజీ ముఖ్యమంత్రినాదెండ్ల భాస్కరరావు ఓటర్లజాబితాలో తన పేరుకనిపించకపోవడంతో నిరాశతోవెనుదిరిగారు. అలాగే సినీనటుడు, మాజీపార్లమెంటు సభ్యుడు కె.సత్యనారాయణ పేరు కూడా ఓటర్లజాబితాలో కనిపించలేదు.నల్లగొండజిల్లా కోదాడలో కొందరి ఓట్లుగల్లంతయ్యాయి. దీంతో వారు నిరసనవ్యక్తం చేశారు. వోటింగ్‌ యంత్రాలుసరిగా పని చేయకపోవడంతో కొన్ని చోట్లపోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.యంత్రాలను ఎలా వాడాలో తెలియక కొన్నిప్రాంతాల్లో ఓటర్ల పోలింగ్‌ కేంద్రాలకురావడానికి వెనుకాడారు. అయితేపోలింగ్‌ సిబ్బంది సర్ది చెప్పడంతో వారు ఓటువేశారు. విశాఖపట్నం నియోజకవర్గంలోకొందరి ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో వారుఆందోళనకు దిగారు. ఫొటో గుర్తింపుకార్డులు ఉన్నప్పటికీ జాబితాల్లో వారిపేర్ల కింద అండర్‌లైన్‌ చేసి ఉంది.దాంతో ఓటు వేయనీయలేదు.కరీంనగర్‌ జిల్లాలో కొన్ని చోట్లబతికున్నవారి పేర్లు లేవు కానీచనిపోయినవారి పేర్లున్నాయి.సికింద్రాబాద్‌ నియోజకర్గంలో నాలుగుపోలింగ్‌ కేంద్రాల్లో యంత్రాలుమొరాయించాయి. వాటిని బాగు చేసినతర్వాత ఓటర్ల తమ ఓటు హక్కునువినియోగించుకున్నారు.జాబితాల్లోకొందరి పేర్లు గల్లంతు కావడానికిప్రతిపక్షాలే బాధ్యత వహించాలనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అన్నారు. ఓటర్లజాబితాలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలుగగ్గోలు పెట్టడం వల్లనే ఇది జరిగిందని ఆయనఅన్నారు.జాబితాల్లోఓటర్ల పేర్లు గల్లంతు కావడానికిచంద్రబాబునాయుడు ప్రభుత్వంబాధ్యత వహించాలని ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి. శ్రీనివాస్‌ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయివిచారణ జరగాల్సిన అవసరంఉన్నదని ఆయన అన్నారు. తాము ఏపేర్లయితే గుర్తించి చేర్చాలని చెప్పామోఅవే జాబితాల్లో లేవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X