మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
హైదరాబాద్:రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్దాదాపు ప్రశాంతంగా ముగిసింది. యాబైఅయిదు నుంచి అరవై అయిదు శాతంఓటింగ్ జరిగినట్లు సమాచారం.తెలుగుదేశం, కాంగ్రెస్కార్యకర్తల మధ్య అక్కడక్కడాఘర్షణలు జరగడం మినహా పెద్దగాఅవాంఛనీయ సంఘటనలేవీజరగలేదు. అయితే కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్వోటింగ్ యంత్రాలు మొరాయించడం,పెద్ద యెత్తున జాబితాల్లోంచి ఓటర్లపేర్లు గల్లంతు కావడం వివాదంసృష్టించింది.తొలివిడత రాష్ట్రంలో ఇరవై ఒక్కలోక్సభ స్థానాలకు, వాటి పరిధిల్లోనినూటా నలబై యేడు అసెంబ్లీ స్థానాలకుమంగళవారం పోలింగ్ జరిగింది. ఈ తొలివిడత పోలింగ్లో రాష్ట్రంలోనిహేమాహేమీల జాతకాలుబయటపడనున్నాయి. పార్లమెంటుకుపోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రినేదురుమల్లి జనార్దన్ రెడ్డి,తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మాజీనేత కె. ఎర్రంనాయుడు,కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయజాతకం ఈ పోలింగ్లో తేలనున్నది.అలాగే బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి సిహెచ్. విద్యాసాగర్, తెలంగాణరాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు మధ్యకరీంనగర్ పార్లమెంట్ స్థానంలోహోరాహోరీ పోరుకు తెరపడనుంది.నల్లగొండ లోక్సభ సీటులో సిపి ఐ రాష్ట్రసమితి కార్యదర్శి సురవరంసుధాకర్ రెడ్డి, రాష్ట్ర బిజెపిఅధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డిపరస్పరం తలపడ్డారు.కాగా,శాసనసభకు పోటీ చేసినపలువురు ప్రముఖుల జాతకాలు కూడా ఈపోలింగ్లో బయటపడనుంది. ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి. శ్రీనివాస్, టి ఆర్యస్ అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు, మంత్రులుకడియం శ్రీహరి, నాగం జనార్దన్ రెడ్డి,విజయరామారావు, మండవవెంకటేశ్వరరావు, ముద్దసానిదామోదర్ రెడ్డి, స్పీకర్ కె.ప్రతిభాభారతి, మాజీ పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావుభవిష్యత్తును ఈ పోలింగ్తేల్చనున్నది.