వాళ్ళు బాగా ఆడారు:రాహుల్ ద్రావిడ్
గుంటూరు:ఎన్నికల సర్వేలు శాస్త్రీయంగా జరగడంలేదని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడుఅభిప్రాయపడ్డారు. సర్వేలు అవాస్తావాలనువెల్లడిస్తున్నాయని ఆయనబుధవారం విలేకరులతో అన్నారు.సర్వేలుశాస్త్రీయంగా జరగకపోతే తీవ్రగందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఇంట్లో కూర్చునిసర్వేలు నిర్వహించడం సరి కాదనిఆయన అన్నారు. తాను పందొమ్మిది వందలఎనబై అయిదు నుంచి సర్వేలునిర్వహిస్తున్నట్లు ఆయనతెలిపారు.ఎలక్ట్రానిక్వోటింగ్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడంపై తానేమీచెప్పలేనని, పోలింగ్ సిబ్బందికిమరింత శిక్షణ అవసరమని ఆయనఅన్నారు.రాష్ట్రంలోతమదే విజయమని, తెలంగాణలోతమకు ప్రజల నుంచి స్పందనలభించిందని ఆయన అన్నారు. కోస్తా,రాయలసీమలలో తమ పార్టీ క్లీన్స్వీప్ చేస్తుందని, కొద్ది రోజుల్లో రాష్ట్రంలోతమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయన అన్నారు.