మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
కాకినాడ:కాంగ్రెస్ను గెలిపిస్తే రాస్ట్రంలోతుపాకి రాజ్యం వస్తుందనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అన్నారు. ఆయనగురువారంనాడు తూర్పు గోదావరిజిల్లాలో రోడ్షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మండపేటలోప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.నక్సలైట్లతో కాంగ్రెస్, తెలంగాణరాష్ట్ర సమితి కుమ్మక్కయ్యాయనిఆయన విమర్శించారు.ఈఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించిసమైక్యాంధ్రను కాపాడాలని ఆయనఓటర్లకు పిలుపునిచ్చారు. టి ఆర్యస్ప్రాంతీయ విద్వేషాలనురెచ్చగొడుతోందని, ప్రాంతీయ విద్వేషాలురెచ్చగొట్టే ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుందని, ఓట్ల కోసం ఏదైనా చేసేకాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరంఉన్నదని ఆయన అన్నారు. ఇంతకుముందు ఒక రాజశేఖర్ రెడ్డేతిడతారనుకునేవాళ్లమని,ఇప్పుడు చంద్రశేఖర్రావు కూడా కోస్తాప్రజలను, తనను తిడుతున్నారనిఆయన అన్నారు. నీళ్లన్నీ కోస్తా వాళ్లేతీసుకుంటున్నారని ప్రచారంచేస్తున్నారని ఆయన అన్నారు.ఈఎన్నికల్లో తాము యాబై మందిమహిళలకు టికెట్లు ఇచ్చామని,కాంగ్రెస్వారు ఇరవై అయిదు మందికిమాత్రమే ఇచ్చారని, అటువంటప్పుడు వారు ఏముఖం పెట్టుకుని మహిళలనుఓట్లడుగుతారని ఆయన అన్నారు. గతఎన్నికల్లో మహిళలే తననుగెలిపించారని, ఈసారి కూడా వారేగెలిపిస్తారని ఆయన అన్నారు. పోలింగ్జరిగిన తెలంగాణ ప్రాంతంలోనూతమకు మెజారిటీ సీట్లు వస్తాయనిఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆడపడుచులు, యువత తమ వైపేఉన్నారని ఆయన చెప్పారు.