వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
ఒంగోలు: బాపట్ల పార్లమెంటు స్ధానానికి పోటీ చేస్తున్న ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి గురువారం ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరఫున చేసిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పురంధరేశ్వరి కాంగ్రెస్ అభ్యర్ధిగా డి.రామానాయుడు మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఎన్టి రామారావు స్ధాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఇప్పుడు లేవని, చంద్రబాబు నాయుడు గ్రామీణ నిరుపేదలను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఒంగోలు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసులు రెడ్డి తరఫున ఆమె చేసిన రోడ్షోలకు మంచి ఆదరణ లభించింది.
Story first published: Thursday, April 22, 2004, 23:53 [IST]