రాష్ట్రమంతటాభారీవర్షాలు, పంటలనష్టం
అనంతపురం:అరాచకం కావాలో, రైతుల సమస్యపరిష్కారం కావాలో తేల్చుకోవాల్సినసమయం ఆసన్నమైందని కాంగ్రెస్లెజిస్లేచర్ పార్టీ (సియల్పి) మాజీనేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డి అనంతపురం ప్రజలను ఉద్దేశించిఅన్నారు. తన జైత్రయాత్రలోభాగంగా ఆయన శుక్రవారంఅనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగినబహిరంగ సభలో ప్రసంగించారు.రైతులసమస్యలు పరిష్కారం కావాలంటేకాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రైతాంగం సంక్షోభంలోకూరుకుపోయిందని, రైతులు, రైతుకూలీలు ఆత్మహత్యలు చేసుకున్నాచంద్రబాబునాయుడు ప్రభుత్వంపట్టించుకోలే దని ఆయనవిమర్శించారు. రైతులఆత్మహత్యలపై సుప్రీంకోర్టుమందలించే దాకా తెలుగుదేశంప్రభుత్వం కదలలేదని ఆయనఅన్నారు. ప్రజలు కరువుతోఅల్లాడుతుంటే పనికి ఆహారం పథకంకింద వచ్చిన బియ్యంతోతెలుగుదేశం పార్టీ కార్యకర్తలుజేబులు నింపుకున్నారని ఆయనవ్యాఖ్యానించారు. తెలుగుదేశం,బిజెపిలపై ఆయన తీవ్రంగాధ్వజమెత్తారు.