వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు

By Staff
|
Google Oneindia TeluguNews

కాకినాడ:పోలింగ్‌ అనంతర విధ్వంసంతోతూర్పు గోదావరి జిల్లా అట్టుడుకిపోతోంది.కాకినాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది.మున్సిపల్‌ చైర్మన్‌ బీరకచంద్రశేఖర్‌ కాంగ్రెస్‌కు రాజీనామాచేసి తెలుగుదేశం పార్టీలో చేరినసంఘటనపై తెలుగుదేశం,కాంగ్రెస్‌ల మధ్య మొదలైనఘర్షణ విధ్వంసానికి దారి తీసింది.మంగళవారమంతా విధ్వంసంకొనసాగుతూనే ఉన్నది.

రెండుపార్టీలవారు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. సోడా సీసాలువిసురుకున్నారు. వాహనాలు ధ్వంసంచేసుకున్నారు. ఇరు పార్టీలవారురాస్తారోకోలకు దిగారు. చంద్రశేఖర్‌తెలుగుదేశం పార్టీలో చేరినందుకుగుర్రుగా ఉన్న కాంగ్రెస్‌వారు పోలింగ్‌ముగిసేవరకు ఓపిక పట్టారు. ఆతర్వాత కాంగ్రెస్‌ నాయకుడుముత్తా గోపాలకృష్ణ, మరికొంతమందితో కలిసి మంగళవారంచంద్రశేఖర్‌ ఛేంబర్‌కు వెళ్లారు.అక్కడ వారు విధ్వంసం సృష్టించారని,తనపై దాడికి దిగారనిచంద్రశేఖర్‌ అంటున్నారు. ముత్తాగోపాలకృష్ణ, మరికొందరిపై పోలీసులుకేసు నమోదు చేశారు. తెలుగుదేశంకార్యకర్తలు ముత్తా గోపాలకృష్ణ సినీథియేటర్‌ను ధ్వంసం చేశారు. ప్రతిగాకాంగ్రెస్‌ కార్యకర్తలుచంద్రశేఖర్‌ ఇంటిలో, అస్పత్రిలోవిధ్వంసం సృష్టించారు. ఆ తర్వాతముగ్గురు కార్పోరేటర్ల ఇళ్లనుతెలుగుదేశం పార్టీవారు కొల్లగొట్టారు.పరస్పరం వాహనాలపై దాడులుచేసుకున్నారు. వాహనాలను దగ్ధంచేసుకున్నారు. దీంతో కాకినాడలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. తెలుగుదేశంవారుదౌర్జన్యాలు ఆపకపోతే తాడోపేడోతేల్చుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ జిల్లాకాంగ్రెస్‌ కమిటీ (డిసిసి) అధ్యక్షుడుజక్కంపూడి రామ్మోహన్‌రావు అన్నారు.ఆత్మరక్షణకు సిద్ధం కావాలనిఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలకుపిలుపునిచ్చారు. ఈ దౌర్జన్యాలకుముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుబాధ్యత వహించాలని ఆయన అన్నారు.తెలుగుదేశంవారుమారణాయుధాలతో స్వైరవిహారంచేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X