వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియానేఅడుగుతా : వెంకటస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

జనార్దన్‌రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మికి రాష్ట్రమంత్రివర్గంలో చోటు లభించింది. అయితే ఆమెశనివారం రాత్రి రాజీనామా చేశారు. అదేవిధంగా వెంకటస్వామి కుమారుడు జి.వినోద్‌కు కూడా రాష్ట్ర మంత్రివర్గంలోచోటు లభించింది. వినోద్‌ తనమంత్రపదవికి రాజీనామా లేఖ రాసితన వద్దే ఉంచుకున్నారు. ఈవిషయాన్ని వెంకటస్వామిధృవీకరించారు.ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి. శ్రీనివాస్‌తో పాటు వినోద్‌ ఆదివారంనాడుఢిల్లీ చేరుకున్నారు. వారు నేరుగావెంకటస్వామి నివాసానికి వెళ్లారు. తానుమన్మోహన్‌ సింగ్‌నుఅభినందించడానికి మాత్రమే ఢిల్లీవచ్చానని శ్రీనివాస్‌ అంటున్నారు.వెంకటస్వామి, జనార్దన్‌రెడ్డి తమసమస్యను సోనియాకు చెప్పుకునిపరిష్కరించుకుంటారని ఆయన అన్నారు.తనకు సమస్య ఏదీ కనిపించడంలేదని ఆయన అన్నారు. వారి సమస్యసామరస్య పూర్వకంగా పరిష్కారంఅవుతుందని ఆయనఅభిప్రాయపడ్డారు.పార్టీలోసంక్షోభం ప్రారంభమైందనేవిధంగా తాను సమస్యసృష్టించదలుచుకోలేదనివెంకటస్వామి అన్నారు. తాను దేశంలోనేసీనియర్‌ మోస్ట్‌ పార్లమెంటుసభ్యుడినని, తనకు మంత్రి పదవిదక్కకపోవడంపై సోనియానేఅడుగుతానని, తన సేవలను మరోచోట వినియోగించుకునే అవకాశం ఉందాఅనేది కూడా తేల్చుకుంటానని ఆయనఅన్నారు.ఇదిలావుంటే, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోనియాను కలిసి దాదాపు నలబైఅయిదు నిమిషాల పాటు చర్చలు జరిపారు.చర్చల వివరాలను వెల్లడించడానికిజనార్దన్‌ రెడ్డి నిరాకరించారు. అయితేవెంకటస్వామికి సోనియాను కలిసేఅవకాశం రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X