వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్‌,కెసిఆర్‌లకు కేబినెట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారతదేశ నూతన ప్రధానమంత్రిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జైపాల్‌రెడ్డి,కె.చంద్రశేఖరరావులకు కేబినెట్‌ ర్యాంకు లభించింది. ఎ.నరేంద్ర,రేణుకాచౌదరి, దాసరి నారాయణ రావు, పనబాకలక్ష్మిలకు సహాయ మంత్రి పదవులు దక్కాయి.

కేంద్రమంత్రులైనప్రముఖుల్లో లాలూప్రసాద్‌ యాదవ్‌, ప్రణబ్‌ ముఖర్జీ, శర ద్‌ పవార్‌,రాంవిలాస్‌ పాశ్వాన్‌, గులాంనబీ ఆజాద్‌ ఉన్నారు. మనరాష్ట్రానికిచెందిన సీనియర్‌ నాయకులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి,వెంకటస్వామిలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించలేదు.నేదురుమల్లి జనార్ధనరెడ్డి భార్య రాజ్యలక్ష్మికి,వెంకటస్వామి కుమారుడు వినోద్‌కు రాష్ట్రంలో మంత్రి పదవులుఇచ్చినందువల్ల వీరికి స్ధానం లభించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిఅధ్యక్షుడు చంద్రశేఖరరావుకు షిప్పింగ్‌ శాఖ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X