రాజీవ్గాంధీని గుర్తుచేసుకున్న కాంగ్రెస్ నేతలు
లౌకికత్వంగొప్పతనాన్ని పొగుడుతూ మతతత్వం ముప్పు బారి నుంచి భారతప్రజానీకం జాగ్రత్తపడాలని కోరుతూ రాజీవ్గాంధీ చేసినప్రసంగాన్ని ఈ సందర్భంగా ప్రసారం చేశారు. భారతదేశంలౌకిక దేశమైనప్పటికీ పౌరులంతా లౌకికత్వానికి కట్టుబడిఉండాలనే సూత్రం ఎక్కడా లేదని రాజీవ్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ,జవహర్లాల్ నెహ్రూ అందించిన స్ఫూర్తికి లక్షలాది మంది భారతీయులుప్రభావితులయ్యారని అన్నారు.గాంధీ, నెహ్రూ పట్ల ప్రజలు ఉంచినఅచంచల విశ్వాసం వారిని దేశ విభజన కోరిన వారి మాయలో పడవేయలేదని అన్నారు. భారతదేశాన్ని కష్టాల కడలిలో చూడాలనికోరుకునే శక్తులున్నాయని వాటి నుంచి అప్రమత్తంగా ఉండాలనిరాజీవ్ హెచ్చరించారు. భారతదేశం ఎదుర్కొనే సవాళ్ళుసామాన్యమైనవి కావని దేశ వ్యతిరేక శక్తులనుఓడించటానికి కులం, మతం, సంఘాలకు అతీతంగాదేశప్రయోజన మే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకుకదలాలని రాజీవ్ ప్రసంగంలో పిలుపునిచ్చారు.