అసంతృప్తివాస్తవం కాదు: వైయస్
శాఖలకేటాయింపుపై కొంత మంది మంత్రులుఅలిగినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులుదక్కలేదని కొందరు, ప్రాధాన్యతగల శాఖలు ఇవ్వలేదని కొందరు అలకవహించినట్లు సమాచారం. అయితే ఈవిషయంలో ఎవరు కూడా పెద్దగాబయటపడటం లేదు. మాజీ ముఖ్యమంత్రినేదురుమల్లి జనార్దన్ రెడ్డిసతీమణి యన్. రాజ్యలక్ష్మి శనివారంరాత్రి తన రాజీనామా లేఖనుముఖ్యమంత్రికి పంపించారు. భద్రతాసిబ్బందిని, వాహనాలను కూడా వెనక్కిపంపించారు. అయితే మీడియాతోమాట్లాడడానికి మాత్రం ఆమెఅందుబాటులోకి రావడం లేదు. కేంద్రమంత్రివర్గంలో తన భర్తకుస్థానం దక్కనందుకు నిరసనగాఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.నేదురుమల్లిజనార్దన్ రెడ్డికి కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వలేదనే కారణంతోరాజ్యలక్ష్మి రాజీనామా చేయలేదనిరాజశేఖర్ రెడ్డి మీడియాప్రతినిధులతో అన్నారు. శాఖలకేటాయింపుపై కొందరు మంత్రులుఅసంతృప్తితో ఉన్నారనే మాటలోవాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు.ఇదిలావుంటే,గ్రామీణాభివృద్ధి శాఖ దక్కిన ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి. శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లారు. ఆయనతనకు కేటాయించిన శాఖపై తీవ్రఅసంతృప్తితో ఉన్నట్లు వార్తలువెలువడ్డాయి. తన ఢిల్లీ యాత్రకు,తనకు దక్కిన మంత్రిత్వ శాఖతో ఏమాత్రం సంబంధం లేదని ఆయనఅంటున్నారు. వ్యవహారశైలిని బట్టిప్రాధాన్యం వస్తుంది గానీ మంత్రిత్వశాఖను బట్టి కాదని, తకు వ్యక్తిగా,పిసిసి అధ్యక్షుడిగా ప్రాధాన్యంఉన్నదని ఆయన అన్నారు.