వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోఆరుగురు రైతుల ఆత్మహత్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో మరో ఆరుగురు రైతులుఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఆత్మహత్యా యత్నాలకుపాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు,నల్లగొండ జిల్లాలో ఇద్దరు రైతులుమంగళవారం ఆత్మహత్యలుచేసుకున్నారు.

గుంటూరుజిల్లా బాపట్లలో చాపల శ్రీనివాస్‌, ఐదుకూరులోజయరావు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకఆత్మహత్యలు చేసుకున్నారు.జయరావు తనకున్న ఒక ఎకరానికితోడు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకునిపంటలు వేశాడు. పంటలుపండకపోవడంతో చేసిన లక్షాడెబ్బై అయిదు వేల రూపాయల అప్పునుచెల్లించలేకపోయాడు.నల్లగొండజిల్లా కోదాడ మండలంలో సయ్యద్‌హుస్సేన్‌ అనే రైతు ఆత్మహత్యచేసుకున్నాడు. ఇతను మామిడి తోటనుకౌలుకు తీసుకున్నాడు. నక్రేకల్‌మండలంలో లింగయ్య అనే రైతుచనిపోయాడు. ఇతను వడదెబ్బతోచనిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడాఅనేది వివాదంగా మారింది. కృష్ణా జిల్లాలోసురేష్‌ అనే రైతు, కర్నూలు జిల్లాలోలక్ష్మి అనే రైతు ఆత్మహత్యలుచేసుకున్నారు. రైతులకుఅందిస్తున్న సహాయ కార్యక్రమాలపైగ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారంచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.రైతుల పరిస్థితిపై వ్యవసాయశాఖమంత్రి యన్‌. రఘువీరా రెడ్డి,రెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు.రైతుల్లో ఆత్మస్థయిర్యంకలిగించడానికి చర్యలు తీసుకుంటామనిధర్మాన ప్రసాదరావు చెప్పారు.రైతులకోసం తీసుకున్న చర్యలను గ్రామీణస్థాయిలో ప్రచారం చేసేందుకుపూనుకోవాలని వామపక్షాల నాయకులుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిని కోరారు. పరిస్థితిపైచర్చించేందుకు అఖిల పక్ష సమావేశంఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు.రుణ విమోచన చట్టం తేవాలని వారుఅభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X