వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణచేర్పునకు మేం వ్యతిరేకం:సిపియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో భూ సమస్య పరిష్కారానికిఉన్నత స్థాయి కమిటీని వేయాలనిసిపియం నాయకులు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినికోరారు. భూ సమస్య పరిష్కారానికియుద్ధప్రాతిదికపై చర్యలు తీసుకొని,ఏడాదిలోగా సమస్యను పరిష్కరించాలనివారు విజ్ఞప్తి చేశారు. సిపియం రాష్ట్రకార్యదర్శి బి.వి. రాఘవులునేతృత్వంలోని ప్రతినిధి బృందంముఖ్యమంత్రికి విజ్ఞప్తిపత్రంసమర్పించింది.

ప్రభుత్వంచేపట్టాల్సిన స్వల్ప, దీర్ఘకాలికకార్యక్రమాలను సిపియం నాయకులుముఖ్యమంత్రికి సూచించారు. తెలంగాణఅంశాన్ని ఐక్య ప్రగతిశీల కూటమి కనీస ఉమ్మడికార్యక్రమంలో చేర్చడానికి తామువ్యతిరేకమని రాఘవులువిలేకరులకు చెప్పారు.శాంతిభద్రతల సమస్య పరిష్కారానికినక్సల్స్‌తో చర్చలు జరపాలని తాముముఖ్యమంత్రికి సూచించినట్లు ఆయనతెలిపారు.నిధులఖర్చు అవసరం లేకుండా పరిష్కారంచేయగల సమస్యలను తాముముఖ్యమంత్రికి వివరించామని ఆయనచెప్పారు. వెనకబడిన ప్రాంతాలఅభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిచేయాలని చెప్పినట్లు ఆయన తెలిపారు.గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలని, స్థానిక సంస్థలకు ఎక్కువఅధికారాలు ఇవ్వాలని సిపియం నాయకులుముఖ్యమంత్రిని కోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X