వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌తోచర్చలకు కమిటీ: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని హోం మంత్రికుందూరు జానా రెడ్డి చెప్పారు. ఈ కమిటీఏర్పాటుకు ముందు నిపుణుల సలహాలుతీసుకుంటామని ఆయన చెప్పారు. పౌరహక్కుల నేత, ప్రముఖ న్యాయవాది కె.జి.కన్నాభిరాన్‌ శుక్రవారంనాడుజానారెడ్డితో చర్చలు జరిపారు.చర్చల ఎజెండా ఖరారకు కమిటీవేస్తామని ఆయన చెప్పారు.

చర్చలకుఅనువైన వాతావరణంఏర్పరచడానికి ప్రభుత్వం పోలీసుకార్యకలాపాలను అన్నింటినీ ఆపేయాలనికన్నాభిరాన్‌ డిమాండ్‌ చేశారు.ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలనువిడనాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్‌కౌంటర్లను ఆపేయాలని, పొటా కిందపెట్టిన కేసులను ఎత్తేయాలని,నక్సల్స్‌పై ప్రకటించిన రివార్డులనుఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.భూసంస్కరణలపై హామీలు ఇవ్వడం ద్వారాచర్చలను ఫలప్రదంచేయవచ్చునని ఆయనఅభిప్రాయపడ్డారు.క్రిమినల్‌చట్టాలను వాడే విధానంప్రజాస్వామికమైనది కాదని,ప్రభుత్వం దానికి స్వస్తి చెప్పాలని,నక్సల్స్‌ కుటుంబాలను, నక్సల్స్‌కుఅన్నం పెట్టేవారిని, మందులు ఇచ్చేవారినివేధించడం మానుకోవాలని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X