వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్యూనిస్టులుమూర్ఖులేం కారు: బుద్ధదేవ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కమ్యూనిస్టులు మూర్ఖులు కారని, వీళ్లుసంస్కరణలకు వ్యతిరేకులు కారనిపశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిబుద్ధదేవ్‌ భట్టాచార్య అన్నారు.మానవీయ కోణంతో సంస్కరణలు అమలుకావాలనే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌అభిప్రాయంతో తమకు ఏకీభావంఉన్నదని ఆయన శనివారంఅన్నారు.

బుద్ధదేవ్‌భట్టాచార్య నలబై నిమిషాల పాటుమన్మోహన్‌ సింగ్‌తోసమావేశమయ్యారు. అనంతరంవిలేకరులు అడిగిన ప్రశ్నలకుసమాధానం ఇస్తూ ఆ విధంగా అన్నారు.ప్రధానిని మర్యాదపూర్వకంగామాత్రమే కలిశానని ఆయన చెప్పారు.పశ్చిమ బెంగాల్‌ ఐటి, కమ్యూనికేషన్‌రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనుఆహ్వానించి, స్వీకరించిందని ఆయనచెప్పారు.పశ్చిమబెంగాల్‌కు జపాన్‌ ప్రత్యక్షపెట్టుబడులు గణనీయంగా వచ్చాయని,మిట్సుబిషి, మారుబెని వంటి కంపెనీలుపెద్ద యెత్తున రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టడానికి ముందుకు వస్తున్నాయనిఆయన అన్నారు. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌వసతులు ఏర్పాటు చేసిన ఐబియంవిస్తరణకు పూనుకుంటోందని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X