బెల్లంకొండ,చౌదరిలిద్దరి పరిస్థితి విషమం
అసెంబ్లీఆవరణలో సింహాద్రిపై ఉద్యోగులు ఒకానొకసందర్భంలో నెట్టేశారు. దీంతో సింహాద్రిరక్షణకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సివచ్చింది. మొదట విద్యాశాఖ కార్యదర్శిసుధీర్ సింహాద్రి రక్షణకు వచ్చారు.కొద్దిసేపటికి సుధీర్వెళ్లిపోవడంతో ఏం చేయాలో సింహాద్రికిఅంతుబట్టలేదు. ఉద్యోగుల నుంచికాపాడుకోవడానికి సింహాద్రితెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీకార్యాలయంలోకి వెళ్లడానికిప్రయత్నించారు. లోనికి ఆయననుఅనుమతించడానికి టిడియల్పిసిబ్బంది నిరాకరించారు.
ఉద్యోగులువెంబడిస్తుండడంతో పోలీసులు సింహాద్రినిరక్షణతో వాహనంలోకి ఎక్కించిసురక్షితంగా బయటకు పంపారు.తనపై ఉద్యోగుల దాడికికారణమేమిటో తనకు తెలియదనిసింహాద్రి విలేకరులతో అన్నారు.అకారణంగా ఎనిమింది ప్రొఫెసర్లను,అసిస్టెంట్ ప్రొఫెసర్లను సింహాద్రిఉద్యోగాలనుంచి తొలిగించారని ఉద్యోగులుఆరోపించారు. సింహాద్రి నియంతలాగావ్యవహరిస్తూ వందలాది మందిబోధనేతర సిబ్బందిని కూడా ఉద్యోగాలనుంచి తొలగించారని వారు చెప్పారు.