వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలో భారీసంస్థాగత మార్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన బిజెపిసంస్థాగత మార్పులకు శ్రీకారంచుట్టింది. మాజీ కేంద్ర మంత్రులురాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీలనుబిజెపి జాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు ప్రధానకార్యదర్శులుగా నియమించారు.ఆదివారం పార్టీ ప్రక్షాళన జరిగింది.

సంజయ్‌జోషితో పాటు ప్రమోద్‌ మహాజన్‌ ప్రధానకార్యదర్శులుగా కొనసాగుతారు.వీరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీనిసమాయత్తం చేస్తారు. మహారాష్ట్రఅసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖరులోజరుగుతాయి.ఇప్పటివరకు జాతీయ కార్యదర్శిగా ఉన్నశివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తారు.పార్లమెంటు బోర్డు, కేంద్ర ఎన్నికలకమిటీ కార్యదర్శిగా కూడా ఆయనవ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఈపదవిలో ఇప్పటి వరకు మహాజన్‌వున్నారు.ప్రధానకార్యదర్శిగా వున్న ముక్తార్‌అబ్బాస్‌ నక్వీ పార్టీ ఉపాధ్యక్షుడిగానియమితులయ్యారు. ఆయన పార్టీఅధికార ప్రతినిధిగా కొనసాగుతారు.నక్వీ, జైట్లీలతో పాటు మాజీ విదేశీవ్యవహారాల మంత్రి యశ్వంత్‌ సిన్హాకూడా పార్టీ అధికార ప్రతినిధిగావ్యవహరిస్తారు.పార్టీకోశాధికారిగా రామదాస్‌ అగర్వాల్‌నుతొలగించి ఆయన స్థానంలో సుకుమార్‌నంబియార్‌ను నియమించారు. జానాకృష్ణమూర్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో నంబియార్‌ కోశాధికారిగావున్నారు. మరో ఉపాధ్యక్షుడుప్యారేలాల్‌ ఖండేల్వాల్‌ తనంతతానే పదవి నుంచి తప్పుకున్నారు.ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ను, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రిబాబులాల్‌ మారండీని పార్టీఉపాధ్యక్షులుగా వెంకయ్యనాయుడునియమించారు. మరో ఇద్దరుమహిళలకు కూడా కార్యవర్గంలో చోటుకల్పించారు. ఉపాధ్యక్షురాలిగాజస్‌కౌర్‌ మీనాను, కార్యదర్శిగాకిరణ్‌ మహేశ్వరిని నియమించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X