సియంముందు
పార్టీలోనిఅంతర్గత తగాదాల వల్ల, సాయుధపోరాటానికి ప్రజల మద్దతుకరువైనందున తాములొంగిపోతున్నట్లు నక్సలైట్లుచెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లలోఇరవై ఒక్క మంది కరీంనగర్ జిల్లాకుచెందినవారు కాగా, తొమ్మిది మందివరంగల్ జిల్లాకు చెందివనారు.వీరిలొంగుబాటుతో ప్రతిఘటన గ్రూప్ బలంసగానికి సగం తగ్గినట్లేనని పోలీసుడైరెక్టర్ జనరల్ ఎస్. ఆర్.సుకుమార చెప్పారు. హత్యలు, తీర్పులుచెప్పడం, విధ్వంసాలు వంటి అనేకకార్యక్రమాలతో వీరికి ప్రమేయంఉన్నదని ఆయన చెప్పారు.నక్సలైట్లతోచర్చలు మార్గం సుగమంఅవుతోందని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఈసందర్భంగా చెప్పారు. లొంగిపోయిననక్సలైట్లు గౌరవప్రదంగాజీవించేందుకు ప్రభుత్వంసహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకలవాలని ఆయన నక్సలైట్లకుపిలుపునిచ్చారు.నక్సలైట్లుచర్చలకు సిద్ధపడుతున్నట్లుతమకు సంకేతాలుఅందుతున్నాయని, త్వరలో చర్చలుప్రారంభమవుతాయని, రాజీ కమిటీ ఈచర్చల ప్రక్రియను ముందుకునడిపిస్తుందని ఆయన చెప్పారు.