వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: న్యాయమూర్తి ఆదేశంపైబాలకృష్ణను సోమవారం ఉదయం నిమ్స్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. బాలకృష్ణ ఆరోగ్య నివేదికను కేర్‌ఆస్పత్రి వారు నిమ్స్‌కు సమర్పించారు. ఆయన ఆరోగ్యపరిస్ధితిపై మధ్యాహ్నం వరకు వైద్యనిపుణులు న్యాయస్ధానానికి తెలియజేసే అవకాశముంది.బాలకృష్ణను పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్‌ కస్టడీలో ఉంచాలనిమెజిస్టేట్‌ ఆదేశించారు.

బాలకృష్ణను సోమవారం ఉదయం పదకొండు గంటలకుకేర్‌ ఆస్పత్రి నుంచి ఐదో మెట్రోపాలిటన్‌ మెజ్రిస్టేట్‌ కోర్టులోహాజరుపరిచారు. వీల్‌ చైర్లో ఆయనను అంబులెన్సు వద్దకుతీసుకెళ్తున్నప్పుడు ఆయన నిద్రలో ఉన్నట్టుగా కన్పించారు.ఆయనకు వైద్యులు మత్తుమంది ఇచ్చినట్టు తెలుస్తోంది. తానుమాట్లాడే స్ధితిలో లేనని బాలకృష్ణ మెజ్రిస్టేటుకు చెప్పినట్టుతెలుస్తోంది. ప్రస్తుతం జుడిషియల్‌ కస్టడీలో ఉన్న బాలకృష్ణకుఆరోగ్యస్ధితిపై కేర్‌ ఆస్పత్రి డాక్టర్ల వెర్షన్‌ నమ్మశక్యంగాలేదని పోలీసులు న్యాయమూర్తికి నివేదించారు. ఆయనను ఉస్మానియాఆస్పత్రికి తరలించి ప్రభుత్వ డాక్టర్లతో పరీక్ష చేయించడానికిఅనుమతి ఇవ్వమని కోరారు. బాలకృష్ణ కాల్పుల ఉదంతంపైసమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా న్యాయమూర్తి పోలీసుఅధికారులను ఆదేశించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X