వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌నుపరిశీలిస్తామని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌ చెప్పారు. పార్లమెంటుఉభయసభలను ఉద్దేశించి ఆయనసోమవారం చేసిన ప్రసంగంలోతెలంగాణ డిమాండ్‌ ప్రస్తావించారు. ఈప్రస్తావన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఉద్యమంలో ఒక మైలురాయి అని తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకులుభావిస్తున్నారు.

రాష్ట్రపతిప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుప్రస్తావన రావడం పట్ల తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావుహర్షం వ్యక్తం చేశారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడడానికి ఇక ఎంతో కాలంపట్టదని ఆయన అన్నారు.ఇదిలావుంటే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోతెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు,కార్యకర్తలు ఈ సందర్భంగాఉత్సవాలు జరుపుకున్నారు.వరంగల్‌లో టి ఆర్‌యస్‌కార్యకర్తలు ప్రదర్శననిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడడం ఇక ఖాయమైనట్లేనని టిఆర్‌యస్‌ శాసనసభా పక్షం నేతవిజయరామారావు అన్నారు.హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఉస్మానియావిశ్వవిద్యాలయంలో ప్రదర్శనజరిగింది. ఏడాది లోపల తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని టి ఆర్‌యస్‌శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డిఈ ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగిస్తూఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X