వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివర్గవిస్తరణపై ఎల్లుండిలోగా..: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైఎల్లుండి లోగా నిర్ణయం తీసుకోనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి సూచనప్రాయంగాతెలియజేశారు. మంత్రివర్గవిస్తరణపై విలేకరులు అడిగినప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పేచేస్తాం కదా అని ఆయన అన్నారు. ఆయనసోమవారం ఢిల్లీకిచేరుకున్నారు.

ఢిల్లీవిమానాశ్రయం నుంచి వైయస్‌నేరుగా కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌వ్యవహారాల ఇన్‌చార్జి, పార్లమెంటరీవ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌వద్దకు వెళ్లారు. అనంతరంఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకున్నారు. రాజ్యసభఅభ్యర్థుల ఖరారుపై, మంత్రివర్గవిస్తరణపై, తాను చేపట్టిన రాజీవ్‌పల్లెబాటపై రాజశేఖర్‌ రెడ్డి సోనియాతోచర్చించారు.తానుచేపట్టిన రాజీవ్‌ పల్లెబాట యాత్ర ప్రజలవద్దకు పాలనకు పూర్తి భిన్నమైదనిరాజశేఖర్‌ రెడ్డి విలేకరులతోఅన్నారు. ప్రజా సమస్యలనుతెలుసుకోవడానికి, ప్రజలతో నేరుగాసంబంధాలు నెలకొల్పుకోవడానికి తాను ఈయాత్రను చేపట్టానని ఆయనవివరించారు. తెలంగాణ అన్ని రంగాల్లోవెనకబడిందని, అందువల్ల తనప్రతి కార్యక్రమం తెలంగాణ నుంచేప్రారంభమవుతుందని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X