వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీఉద్వాసనపై చర్చ జరగదు:వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి ఉద్వాసన పలికే ప్రసక్తి లేదనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుస్పష్టం చేశారు. గుజరాత్‌నాయకత్వ మార్పుపై ఏ విధమైనప్రతిపాదనలు రాలేదని ఆయనసోమవారం విలేకరులతో అన్నారు.

ఇటీవలిఎన్నికల్లో ఓటమికి గుజరాత్‌ అల్లర్లుప్రధాన కారణమని, మోడీఉద్వాసనపై పార్టీ జాతీయ కార్యవర్గసమావేశంలో చర్చ జరుగుతుందనిఅన్న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితోఫోన్‌లో మాట్లాడిన అనంతరంవెంకయ్యనాయుడు విలేకరులసమావేశంలో మాట్లాడారు. మోడీఉద్వాసన అంశంపై జాతీయ కార్యవర్గసమావేశంలో చర్చ జరగబోదనిఆయన స్పష్టం చేశారు.గుజరాత్‌అల్లర్ల వల్లనే ఎన్నికల్లో ఓడిపోయామనితాను చెప్పలేదని వాజ్‌పేయి తనతోచెప్పినట్లు వెంకయ్యనాయుడుతెలిపారు. గుజరాత్‌ అల్లర్ల వల్ల పార్టీఎన్నికల్లో ఓడిపోయిందని తాము గానీ,వాజ్‌పేయి గానీ భావించడం లేదనిఆయన వివరణ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X