వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసకోసమే మంత్రివర్గ విస్తరణ:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితికి చోటుకల్పించడానికే రాష్ట్ర మంత్రివర్గవిస్తరణ చేపడుతున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి విలేకరులతోచెప్పారు. దీంతో కాంగ్రెస్‌శాసనసభ్యులకు తొలి విస్తరణలో చోటులభించదని తేలిపోయింది. అయితే టిఆర్‌యస్‌కు ఎన్ని మంత్రి పదవులుఇస్తారనే విషయంపై మాట్లాడడానికిఆయన నిరాకరించారు.తమకుఏడు మంత్రి పదువులు ఇవ్వడానికికాంగ్రెస్‌ అంగీకరించిందని టి ఆర్‌యస్‌అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావున్యూఢిల్లీలో ప్రకటించారు. ఏడు మంత్రిపదవులు ఇవ్వడానికి రాజశేఖర్‌ రెడ్డినిరాకరించినట్లు సమాచారం.చంద్రశేఖర్‌ చేసిన ప్రకటననువిలేకరులు ప్రస్తావించగా ఆయనసూటిగా సమాధానం ఇవ్వలేదు.

తన మంత్రివర్గ విస్తరణ ఈ నెలఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగుగంటలకు ఉంటుందని ఆయన చెప్పారు.మంత్రివర్గ విస్తరణపై, రాజ్యసభఅభ్యర్థుల ఖరారుపై అఖిల భారతకాంగ్రెస్‌ కమిటీ ( ఎ ఐసిసి)తో చర్చించిఆయన మంగళవారంహైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

ఎఐసిసి ప్లీనం నవంబర్‌లోహైదరాబాద్‌లో జరిగే అవకాశాలున్నట్లుఆయన చెప్పారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ (పిసిసి) పునర్వ్యస్థీకరణతగిన సమయంలో జరుగుతుందనిఆయన అన్నారు. అయితే పిసిసి మార్పువ్యవహారాన్ని ఎ ఐసిసియేచూసుకుంటుందని ఆయన చెప్పారు.పీపుల్స్‌వార్‌తోచర్చలకు సానుకూల వాతావరణంఏర్పడిందని ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌ చర్చలకు కాల్పులవిరమణ ప్రకటన షరతువిధించడాన్ని ప్రస్తావించకుండా పోలీసులుఅడవుల్లోకి వెళ్లడం లేదని ఆయనఅన్నారు. రాష్ట్రంలో ఒక విధమైనకాల్పుల విరమణ అమలు జరుగుతోందనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X