తెరాసకోసమే మంత్రివర్గ విస్తరణ:వైయస్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితికి చోటుకల్పించడానికే రాష్ట్ర మంత్రివర్గవిస్తరణ చేపడుతున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విలేకరులతోచెప్పారు. దీంతో కాంగ్రెస్శాసనసభ్యులకు తొలి విస్తరణలో చోటులభించదని తేలిపోయింది. అయితే టిఆర్యస్కు ఎన్ని మంత్రి పదవులుఇస్తారనే విషయంపై మాట్లాడడానికిఆయన నిరాకరించారు.తమకుఏడు మంత్రి పదువులు ఇవ్వడానికికాంగ్రెస్ అంగీకరించిందని టి ఆర్యస్అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావున్యూఢిల్లీలో ప్రకటించారు. ఏడు మంత్రిపదవులు ఇవ్వడానికి రాజశేఖర్ రెడ్డినిరాకరించినట్లు సమాచారం.చంద్రశేఖర్ చేసిన ప్రకటననువిలేకరులు ప్రస్తావించగా ఆయనసూటిగా సమాధానం ఇవ్వలేదు.
తన మంత్రివర్గ విస్తరణ ఈ నెలఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగుగంటలకు ఉంటుందని ఆయన చెప్పారు.మంత్రివర్గ విస్తరణపై, రాజ్యసభఅభ్యర్థుల ఖరారుపై అఖిల భారతకాంగ్రెస్ కమిటీ ( ఎ ఐసిసి)తో చర్చించిఆయన మంగళవారంహైదరాబాద్కు తిరిగి వచ్చారు.