వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభకు సిపిఎం అభ్యర్ధి పి.మధు
హైదరాబాద్: రాష్ట్రం నుంచిరాజ్యసభకు జరిగే ఎన్నికల్లో సిపిఎం అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పి. మధు పోటీ చేస్తారు. కాంగ్రెస్తోపొత్తులో భాగంగా సిపిఎంకు ఒక రాజ్యసభ స్ధానానికి పోటీచేసేఅవకాశం లభించింది. ఈ స్ధానానికి మొదట సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడుసీతారాం ఏచూరి లేదా ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి బివి రాఘవులుపోటీ చేయవచ్చని వార్తలు వెలువడ్డాయి. మధు పోటీ చేస్తారనిరాఘవులు బుధవారం ఉదయం స్పష్టం చేయడంతో సస్పెన్స్వీడిపోయింది. మధు సిపిఎం రాష్ట్ర శాఖలో రైతు కూలీల విభాగంఇంచార్జిగా ఉన్నారు. తెలుగుదేశం తరఫున రాజ్యసభఎన్నికల్లో సి.రామచంద్రయ్యను నిలబెట్టాలని ఆ పార్టీ పోలిట్ బ్యూరోనిర్ణయించింది. ఈ పదవికి తెలుగుదేశం నాయకులు చాలా మంది పోటీపడినా ఇది చివరికి రామచంద్రయ్యను వరించింది.
Story first published: Wednesday, June 16, 2004, 23:53 [IST]