వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిఓటమికి ప్రధాన బాధ్యుణ్ణి నేనే:వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

పిర్ని(హిమాచల్‌ ప్రదేశ్‌):లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ఓటమికి ప్రధానంగా తనే కారకుడినని, అందుకుతప్పక ప్రాయశ్చిత్తం చేసుకుంటానని మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయిఅన్నారు. ఎన్నికల ప్రచారం ప్రధానంగా నా పేరు మీద జరిగిందికాబట్టి ఓటమికి నేనే అత్యధిక బాధ్యత వహిస్తాను. ఇందుకునేను ప్రాయశ్చితం చేసుకుంటాను అని ఇక్కడ విలేకరులతోఅన్నారు.

ప్రాయశ్చిత్తం అంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా రాజీ లేకుండా పార్టీ కార్యకర్తలం అందరం కష్టపడి పనిచే స్తాం అని బదులిచ్చారు. తరువాతి లోక్‌సభ ఎన్నికలలో వాజపేయి పేరుమీద ప్రచారం జరిగే అవకాశాలున్నాయా అనే ప్రశ్నకుభవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసనివేదాంతధోరణిలో జవాబిచ్చారు. అయితే తాము కష్టపడిపనిచేస్తామని చెప్పారు. బిజెపి ఓటమికి ఏ ఒక్క వ్యక్తిని బాధ్యుల్ని చేయటంలేదని ఇది సమిష్టి ఓటమి అన్నారు. ఓటమి వెనుక కారణాలనువిశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X