వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘీలపై చర్య తీసుకోవాలి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

భంటర్‌(హిమాచల్‌ ప్రదేశ్‌) లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఓటమికి గుజరాత్‌ అల్లర్లే కారణమంటూ రోజుకో సంచలన ప్రకటన చేసిన మాజీ ప్రధాని వాజపేయి శనివారం కొద్దిగా వెనక్కి త గ్గారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పదవి నుంచి తొలగించే అంశం పాతదే అని వ్యాఖ్యానించారు. మోడీ తొలగింపు అంశం పాతదే. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే విషయం పై ప్రస్తుతం దృష్టి ఉంచుతాం అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో బిజెపి పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం జరుగుతున్న సందర్భంగా వాజపేయి వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది.

వారం రోజుల పాటు మనాలిలో విశ్రాంతి పొందిన తరువాత శనివారం న్యూఢిల్లీ బయలుదేరుతూ విమానాశ్రయంలో విలేకరులతో కాసేపు ముచ్చటించారు. గుజరాత్‌ అల్లర్ల తరువాత ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించిందని పార్టీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు పేర్కొనటం సబబేనని వాజపేయి అన్నారు. గెలుపు గురించి మాట్లాడే సందర్భాలలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల గురించి ప్రస్తావించాలి. అక్కడ ఎక్కువస్థానాల్లో బిజెపి కైవసం చేసుకుంది. గుజరాత్‌లో కూడా బిజెపి ఎక్కువ సీట్లనే గెలుచుకుంది అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X