వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:విజయవాడలోని శారదా కళాశాల విద్యార్థినిశ్రీలక్ష్మి హత్య కేసులో యాంటీ గుండాస్క్వాడ్‌ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌లక్ష్మీపతి సస్పెండయ్యారు. విజయవాడపోలీసు కమీషనర్‌ కృష్ణప్రసాద్‌శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. శ్రీలక్ష్మి అనే విద్యార్థినినిమనోహర్‌ అనే యువకుడు కళాశాలఆవరణలో దారుణంగా హత్య చేసినవిషయం తెలిసిందే.

మనోహర్‌అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడనిశ్రీలక్ష్మి ఆరు నెలల క్రితమే అప్పటివిజయవాడ పోలీసు కమీషనర్‌సురేంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ఈవిషయంపై తగిన చర్యలు తీసుకోవాలనిసురేంద్రబాబు లక్ష్మీపతిని ఆదేశించారు.కొంత కాలం నిఘా పెట్టిన లక్ష్మీపతిమనోహర్‌ కాలేజీకి రావడం లేదనితేల్చుకుని ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. అయితే అకస్మాత్తుగామనోహర్‌ ప్రత్యక్షమై శ్రీలక్ష్మినిదారుణంగా హత్య చేయడంతోపోలీసుల వైఫల్యం బట్టబయలైంది. ఇదిలక్ష్మీపతి సస్పెన్షన్‌కు దారి తీసింది. ఈసంఘటనపై విచారణ జరిపించి పోలీసులదితప్పని తేలితే లక్ష్మీపతిపై చర్యలుతీసుకుంటామని కృష్ణప్రసాద్‌చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X