వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు సమస్యలపై టిడిపి వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వ్యవసాయ రంగంపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీసభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రైవేటువ్యక్తుల వద్ద తీసుకున్న రుణాల చెల్లింపుపై ప్రభుత్వం ఆరు నెలలమారటోరియం ప్రకటించడం వల్ల రైతులకు కొత్తగా అప్పులుపుట్టడం లేదని, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అరకొరగా రుణాలుమంజూరు చేస్తున్నాయని టిడిపి సభ్యులు ఆందోళనవ్యక్తంచేశారు. పార్టీ సభ్యులు దేవేందర్‌ గౌడ్‌, ఉమామహేశ్వరరావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను ప్రస్తావించారు.

కష్టాల్లో ఉన్న రైతులకు సంస్థాగత రుణాల మంజూరీపై సహకారశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు, తెలుగుదేశం సభ్యులకుమధ్య వాగ్వివాదం జరిగింది.వ్యవసాయ రుణాల రీషెడ్యూలింగ్‌కు సంబంధించి నాబార్డ్‌మార్గదర్శక సూత్రాలు జారీచేసినప్పటికీ, వాటినిఅమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షం ఆరోపించింది.ప్రభుత్వం రైతులకు మాటల్లోనే సాయం చేస్తోందనీ, చేతల్లో సాయంకనిపించడం లేదనీ గౌడ్‌ అన్నారు. సభలో అరగంటపాటు వాదించినతర్వాత తెలుగుదేశం సభ్యులు వాకౌట్‌ చేశారు. తొమ్మిదిన్నరఏళ్ళపాటు రైతులను పూర్తిగా విస్మరించిన తెలుగుదేశంవారుఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రిలక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X