వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుంచిఆంధ్రకు ఆల్మట్టి నీరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆల్మట్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌కుశనివారం నుంచి నీరు విడుదలకానుంది. ఆల్మట్టి నుంచి నీరుఆంధ్రప్రదేశ్‌కు నీరు విడుదలచేయడానికి శుక్రవారం కర్ణాటకప్రభుత్వం అంగీకరించింది.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినేతృత్వంలోని అఖిల బృందం ఢిల్లీయాత్ర ఫలించినట్లయింది.

ఆల్మట్టినుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీరు విడుదలచేయాలని కర్ణాటకపై ఒత్తిడి తేవాలనిరాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోనిఆంధ్రప్రదేశ్‌ అఖిల పక్ష బృందంగురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరింది. ఈ సమస్యపరిష్కరించాల్సిందిగా మన్మోహన్‌ సింగ్‌కేంద్ర జలనవరుల శాఖ మంత్రిప్రియరంజన్‌ దాస్‌ మున్షీకి సూచించారు.దాంతో మున్షీ రంగంలోకి దిగి కర్ణాటకఆల్మట్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాజలాలను విడుదల చేసేలా చర్యలుతీసుకున్నారు.కర్ణాటకనిర్ణయంపై ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ హర్షంవ్యక్తం చేశారు. కర్ణాటకప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలుతెలియజేశారు. తాము కోరినట్లుయాబై టియంసిల నీరు కర్ణాటకవిడుదల చేస్తుందని ఆశిస్తున్నట్లుఆయన తెలిపారు. ఎంత నీరు విడుదలచేసేది తర్వాత తెలియజేస్తామనికర్ణాటక ఆంధ్రప్రదేశ్‌కు రాసినలేఖలో తెలియజేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X