వార్వరంగల్ జిల్లా సభకు అనుమతి:జానా
హైదరాబాద్:వరంగల్ జిల్లా మొగిలిచెర్లగ్రామంలో తలపెట్టిన పీపుల్స్వార్బహిరంగ సభకు అనుమతిస్తామనిహోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. అన్నిరాజకీయ పార్టీలకు ఇచ్చినట్లుగాపీపుల్స్వార్కు సభనిర్వహించుకోవడానికి ఇవ్వనున్నట్లుఆయన తెలిపారు.అయితేపీపుల్స్వార్ సభ నిర్వహణకుఅనుమతి కోరాల్సి వుంటుందని, అన్నిసభలకు మాదిరిగాశాంతిభద్రతలను కాపాడడానికిపోలీసు బందోబస్తు వుంటుందని ఆయనచెప్పారు. సభకు పీపుల్స్వార్నేతలు తుపాకులతో రావద్దనిఆయన సూచించారు.పోలీసులచేతిలో హతమైన తమ నాయకుడురామకృష్ణ అలియాస్సుదర్శన్రెడ్డి స్మారకార్థం మొగిలిచెర్లలోస్థూపం ఏర్పాటు చేసి ఈ నెల ఇరవైఎనిమిదవ తేదీన సభ నిర్వహించాలనిపీపుల్స్వార్ నిర్ణయించింది. ఈ సభలోపీపుల్స్వార్ రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ అలియాస్హరగోపాల్ పాల్గొంటారనిభావిస్తున్నారు.నక్సలైట్లతో చర్చల కోసం ప్రజల నుంచిసూచనలను ఆహ్వానిస్తున్నామని జానారెడ్డి చెప్పారు.హైదరాబాద్లోని జూబిలీహాల్లోఆదివారం జరిగిన ఒక సమావేశంలోఆయన మాట్లాడారు.ఈసందర్భంగా ఆయన విలేకరులతోపీపుల్స్వార్ బహిరంగ సభ గురించిమాట్లాడారు.