వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్‌,వరవరరావు,కళ్యాణ్‌రావులపై కేసులు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:పీపుల్స్‌వార్‌ ప్రతినిధులువరవరరావు, గద్దర్‌,కళ్యాణ్‌రావులపై వరంగల్‌ జిల్లాఇంతెజార్‌ గంజ్‌ పోలీసులు క్రిమినల్‌కేసులు నమోదు చేశారు. వీరిపై ఆరుసెక్షన్ల కింద పోలీసులు కేసులుపెట్టారు. వీరి ముగ్గురిపై రాజద్రోహంకింద కేసు నమోదు చేశారు.

వారుముగ్గురు ప్రభుత్వ యంత్రాంగాన్నివిమిర్శించారని పోలీసులు తమ నివేదికలోతెలియజేశారు. గద్దర్‌,వరవరరావు, కళ్యాణ్‌ రావుప్రభుత్వ యంత్రాంగాన్నివిమర్శించారని, సాయుధ పోరాటం ద్వారారాజ్యాధికారం చేపడుతామనిచెప్పారంటూ వారిపై పోలీసులు కేసునమోదు చేశారు. వరంగల్‌ జిల్లామొగిలిచెర్ల అమరవీరుల సంస్మరణసభలో సాయుధ పోరాటం ద్వారారాజ్యాధికారం చేపడుతామనివక్తలు స్పష్టం చేసిన విషయంతెలిసిందే. తమపై కేసులు పెట్టడంవాక్‌ స్వాతంత్య్రాన్ని హరించడమేననిగద్దర్‌ అంటున్నారు.కొన్నినిబంధనలతో పీపుల్స్‌వార్‌ సభకుఅనుమతి ఇవ్వడం జరిగిందని, ఆనిబంధనలను వారు ఉల్లంఘించారనిపోలీసు స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అలీఅంటున్నారు. సభ జరిగిన ప్రాంతం తమపరిధిలోకి వస్తున్నందున కేసులుఇక్కడ పెట్టినట్లు ఆయన తెలిపారు. వరవరరావు,గద్దర్‌, కళ్యాణ్‌రావులపై పోలీసులుకేసులు పెట్టడంపై వ్యాఖ్యానించడానికి హోంమంత్రి కె. జానారెడ్డి నిరాకరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X